ANDHRABREAKING NEWSSTATETELANGANAWORLD
చలివేంద్రం ఏర్పాటు హర్షణీయం : కమీషనర్ కృష్ణ
చలివేంద్రం ఏర్పాటు హర్షణీయం : కమీషనర్ కృష్ణ
కర్నూలు కలెక్టరేట్/ ఎమ్మిగనూరు, మార్చి 19, ( సీమకిరణం న్యూస్) :
బాటసారుల దాహం తీర్చేందుకు పట్టణలోని సోమప్ప సర్కిల్ వద్ద ముస్లింలు జమియతే అహ్లేహదీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మిగనూరు సలాఫీ బైతుల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రను పట్టణ మునిసిపల్ కమీషనర్ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మానవతా సేవా సంస్థ చేస్తున్న సలాఫీ బైతుల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ సేవలను అభినందించారు. ప్రజల దాహార్తి తీర్చే చలివేంద్రంను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులకు, పాదచారులకు చలివేంద్రం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఉమర్ ఉమ్రి, సిఫాబతుల్లా, కార్యదర్శులు మొహమ్మద్ మూస జమై, మనియర్ అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.