కర్ణాటక భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున భక్త బృందం…
మూడో రోజు కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం….
నందవరం, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
నందవరం మండల పరిధిలోని నందవరం గ్రామంలో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మల్లికార్జున స్వామి భక్తి బృందం మాట్లాడుతూ కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా కాలి నడక పాదయాత్ర చేసే స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వారిని శ్రీశైలం మల్లికార్జునుడు శ్రీశైలం భ్రమరాంబిక వాళ్ల దీవెన దేశం మొత్తం ఉండాలని వారు తెలియజేశారు.ఈ అన్నదానం కన్నా మించిన దైవం లేదని ఎందరో పెద్దలు మరియు పురాణాల్లో చెప్తూ ఉంటారు. కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు నందవరం గ్రామంలో శ్రీ శ్రీ మల్లికార్జున దేవాలయం భక్తి బృందం మరియు గ్రామ ప్రజలు వారం రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు.